శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజగారి "మధువనం"లో విహరిస్తూంటే పూల పరిమళాలు
, పిల్ల తెమ్మెరలు నన్ను పలుకరించాయి. కథలన్నీ ఒక కావ్య ప్రయోజనాన్ని సిద్ధింప జేసుకుని
, "హమ్ కిసీ సే కమ్ నహీ" అంటూ గర్వంగా తలెత్తుకుని సాహితీ వేదికపై నిలబడ్డాయి.శైలజ కథలు ఏవో టైంపాస్ బటానీలు కావు. ప్రతి కథ వెనుక రచయిత్రిదైన సోషల్ కమిట్]మెంట్ వుంది.
"Poetry Instructs as it delights" అని
"డాక్టర్ జాన్సన్
" అన్నట్లు
సమాజానికి సందేశమిస్తూనే మనసులను అలరింప చేసే కథలవి.
"మేధావుల వలస"ను ఇతివృత్తంగా తీసుకొని మలచిన కథ "స్నేహానికన్న మిన్న". ఆంధ్రోళ్ళు తెలంగాణావారిని దోచుకున్నారని
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అపోహకు గురైన తెలంగాణా యువకుడు ఆంధ్రా
, తెలంగాణావాళ్ళు అమెరికాలో మంచి ఉద్యోగాలన్నీ తమ కైవసం చేసుకుంటున్నారన్న అక్కసుతో అక్కడివారు వారిపై
దాడులు చేయడం చూసి నిజాన్ని తెలుసుకుంటాడు. గట్స్ ఉంటేగాని ఇలాంటి థీమ్స్ రాయలేరు శైలజకు ఆ గట్స్ ఉన్నాయి.హాస్యాన్ని పండించడం రచయితకు కత్తిమీద సాము. మా శైలజ సవ్యసాచి. "ఎంత ఘాటు ప్రేమయో" కథలో పెళ్ళికి ముందు ప్రేమించుకోలేదనే లోటును ఇద్దరు భార్యాభర్తలు ఎలా "కలర్ ఫుల్"గా తీర్చుకున్నారో తెలిసి నవ్వుకుంటాం బిగ్గరగా. ఆరోగ్యకరమైన హాస్యం!
'జబర్దస్త్
' లాంటి వెకిలి లైవ్]షోల వాళ్ళు ఇలాంటి చక్కని హాస్య కథలను స్కిట్]లుగా మార్చి ప్రేక్షకుల
కందిస్తే బాగుంటుంది.
పాణ్యం దత్తశర్మ, వనస్థలిపురం, హైద్రాబాద్